37.2 C
Hyderabad
April 26, 2024 19: 01 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో ఏసీబీకి పట్టుబడిన జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్

#ACB trap

మూడు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ వనపర్తిలో  జిల్లా అటవీశాఖ అధికారి బాబ్జీరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. 

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన వడ్డె నాగరాజు అనే వ్యక్తి వనపర్తి జిల్లాకు  మొక్కలను తరలించారని, మొక్కలకు సంబంధించిన  13 లక్షల రూపాయలు బదిలీ చేస్తామని అటవీశాఖ అధికారి చెప్పారని ఎసిబి డిఎస్పీ బి.శ్రీకృష్ణ గౌడ్ విలేకరులకు తెలిపారు.

మొక్కల  బిల్లు ఇవ్వడానికి  అటవీశాఖ అధికారి బాబ్జీరావు లంచం డిమాండ్ చేశారని, మూడు  బాబ్జీరావు తీసుకున్నారని ఆయన చెప్పారు.

మూడు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఎసిబి సి.ఐ. లు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి  

Related posts

లాక్ డౌన్: రైతుల పంటలు కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలు

Satyam NEWS

గంటా రాక వార్తతో కల్లోలంగా మారిన విశాఖ వైసీపీ

Satyam NEWS

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన భీమ్లానాయక్‌ ఎలివేషన్‌ !

Satyam NEWS

Leave a Comment