సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ కేంద్రంలోని హుజూర్ నగర్ రోడ్డు శకుంతల థియేటర్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన తెలిపారు.
ముంబయిలోని బి.ఆర్.అంబేడ్కర్ నివాసం రాజాగృహపై జరిగిన దాడికి నిరసనగా ఆందోళన చేపట్టిన జర్నలిస్టులు మాట్లాడుతూ రాజాగృహంపై దాడిని ఖండించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.
ప్రభుత్వం స్పందించి త్వరితగతిన న్యాయం చేయాలని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసి, తగినంత భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్ నేతలు, ఎమ్మార్పీఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.