34.2 C
Hyderabad
May 19, 2025 16: 22 PM
Slider నల్గొండ

అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లజెండాలతో నిరసన

#Kodada Journalists

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ కేంద్రంలోని హుజూర్ నగర్ రోడ్డు శకుంతల థియేటర్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన తెలిపారు.

ముంబయిలోని బి.ఆర్.అంబేడ్కర్ నివాసం రాజాగృహపై జరిగిన దాడికి నిరసనగా ఆందోళన  చేపట్టిన జర్నలిస్టులు మాట్లాడుతూ రాజాగృహంపై దాడిని ఖండించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.

ప్రభుత్వం స్పందించి త్వరితగతిన న్యాయం చేయాలని ఇటువంటి సంఘటనలు  పునరావృతం కాకుండా చూసి, తగినంత  భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్ నేతలు, ఎమ్మార్పీఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

గుంటూరు రేంజ్ ఐజీని కలిసిన పల్నాడు జిల్లా ఎస్పీ

mamatha

Good Bye: ముద్రగడ పద్మనాభం లేఖ పూర్తి పాఠం

Satyam NEWS

మంటలు ఆర్పబోయిన విజయ డ్రైవర్ గురునాథం మృతి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!