హైదరాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఏడుగురు జూనియర్ డాక్టర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మెడికల్ విద్యార్ధులందరికి కరోనా టెస్టులు చేస్తున్నారు. క్లాస్ రూమ్స్, ల్యాబ్ లను శానిటైజ్ చేస్తున్నామని ప్రిన్సిపల్ శశికళ తెలిపారు.
జూన్ 20 నుంచి పరీక్షలు ఉన్నందున జూనియర్ డాక్టర్లను హోంక్వారంటైన్ చేస్తున్నామన్నారు. ఒకవేళ కరోనా టెస్టులో ఇంకా ఎవరికైనా పాజిటివ్ వస్తే వారిని గాంధీ హాస్పిటల్ కు తరలిస్తామని, మిగతావారిని హోంక్వారంటైన్ చేస్తామని చెప్పారు.