38.2 C
Hyderabad
April 28, 2024 22: 26 PM
Slider ప్రత్యేకం

తిరుగుబాటు ఎంపిని ముందుగా కలిసిన జస్టిస్ నజీర్

#Justice Nazir

ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ గా నియమితుడైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిసేందుకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే వారందరిని కాదని తొలి అపాయింట్ మెంట్ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ పై తిరుగుబాటు చేసిన నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణంరాజుకు ఇవ్వడం చర్చనీయాంశం అయింది.

ఏపీ కొత్త గవర్నర్ తో రఘురామ భేటీ కావడం ఒక్క సారిగా వైసీపీ నేతల్ని కంగారు పెట్టింది. కొత్త గవర్నర్ గా నియమితులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ అపాయింట్ మెంట్ కోసం అధికార వైసీపీలో పోటీ నెలకొంది. నజీర్ ఇంకా ఏపీ గవర్నర్ గా బాధ్యతలు తీసుకోలేదు. అయినా ఆయన్ను కలిసేందుకు వైసీపీ నేతలు ఢిల్లీలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ముందుగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆయన అపాయింట్ మెంట్ సాధించారు.

Related posts

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ర‌హ‌దారుల నిర్మాణంపై సమీక్ష‌

Satyam NEWS

మానసిక అనారోగ్యానికి పరిష్కారం చూపించే హోమియోపతి

Satyam NEWS

ప్రతి కుటుంబానికి సంక్షేమ తోడ్పాటు

Bhavani

Leave a Comment