38.2 C
Hyderabad
April 27, 2024 16: 41 PM
Slider కడప

కువైట్ లో కరోనా తో కడప జిల్లా వాసి మృతి

#Corona Death

బ్రతుకు తెరువు కోసం వృద్ధ తల్లి దండ్రులు,భార్య పిల్లలను వదిలి కువైట్ కు వెళ్లిన కడప జిల్లా నందలూరు మండలంకు చెందిన యెద్దల వేణుగోపాల్ అక్కడ కరోనా మహమ్మారి బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కడప జిల్లా కువైట్ లో నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె వాసి యెద్దల వేణుగోపాల్ (48) కరోనా తో బుధవారం మధ్యాహ్నం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. తల్లీ, తండ్రి తో పాటు మృతునికి భార్య సుభాషిణి, కొడుకు సాయి, కూతురు జాహ్నవి ఉన్నారు.

మూడు సంవత్సరాల క్రితం వేణు గోపాల్ జీవనభృతి కోసం కువైట్ కు వెళ్లినాడు. అక్కడ కువైట్ బార్డర్ పాహెల్ సమీపంలోని ఆలీకో అల్యూమినియం కంపెనీలో ఉద్యోగం చేసేవాడు.వి ధి వక్రీకరించి ప్రపంచాన్నీ గడగడ లాడిస్తున్న కరోనా మహమ్మారి గత నెలలో సోకింది.

కువైట్ లోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతూన్న వేణుగోపాల్ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీనితో కుటుంబ సభ్యులు కడ చూపు కూడా దక్కకుండా వేణుగోపాల్ మృతి చెందడంతో కన్నీరుమున్నీరు ఔతున్నారు.

వేణుగోపాల్ మరణ వార్త తప్ప,మృతదేహం కూడా చూసే అవకాశం లేకపోవడంతో భార్య సుభాషిణి సృహతప్పి పడి పోయింది.కొ డుకు, కూతురు దిక్కు లేని వారయ్యారు. వృద్ధ తల్లిదండ్రులు బాధ వర్ణనాతీతంగా ఉంది. దీనితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related posts

శ్రీశైల మల్లన్న హుండీల ఆదాయం 1.96 కోట్లు

Satyam NEWS

కేసీఆర్ చెప్పినదే క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక

Satyam NEWS

ఆక్సిజన్ సిలిండర్ లు వృధా చేస్తున్న మెడికల్ డిపార్ట్ మెంట్

Satyam NEWS

Leave a Comment