పోలియోను తరిమి కొట్టడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఖైరతాబాద్ కు చెందిన ప్రజా నాయకుడు ఎం.మహేందర్ బాబు అన్నారు. ఈ రోజు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మహాభారత్ నగర్ కమిటీ హాల్లో చిన్నపిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం.మహేందర్ బాబు పాల్గొన్నారు. అప్పుడే పుట్టిన పిల్లా నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలకు మర్చిపోకుండా పోలియో చుక్కలు వేయించాలని ఆయన ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోరారు. పోలియో డ్రాప్స్ వేయించడం సమాజం పట్ల బాధ్యత నిర్వర్తించడం లాంటిదని ఆయన అన్నారు.
previous post