తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అర్హులైన రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మార్వో ఆఫీస్ లో నేడు ఆయన చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్ పేట్ కార్పొరేటర్ ఈ. విజయ్ కుమార్ గౌడ్, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి, నల్లకుంట కార్పొరేటర్ అమృత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సంక్షేమ పథకాలని అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, ఆమనురి సతీష్, రంగు ఉదయ్ గౌడ్, వేణు, సంతోష్ చారి, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట