39.2 C
Hyderabad
April 28, 2024 14: 03 PM
Slider ముఖ్యంశాలు

అర్హులందరికి సంక్షేమ పథకాలు అందచేయడమే లక్ష్యం

#amberpet

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అర్హులైన రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మార్వో ఆఫీస్ లో నేడు ఆయన చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్ పేట్ కార్పొరేటర్ ఈ. విజయ్ కుమార్ గౌడ్, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి, నల్లకుంట కార్పొరేటర్ అమృత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సంక్షేమ పథకాలని అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, ఆమనురి సతీష్, రంగు ఉదయ్ గౌడ్, వేణు, సంతోష్ చారి, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

క్రీడారంగంలో ప్రభుత్వ సదుపాయాలు ఉపయోగించుకోవాలి

Satyam NEWS

షర్మిల అరెస్టు పై భిన్నాభిప్రాయాలు

Satyam NEWS

ప్రియాంక కుటుంబానికి మంత్రి సబిత పరామర్శ

Satyam NEWS

Leave a Comment