ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ల పేరుతో అందిస్తున్న పథకం పేదింటి ఆడబిడ్డల జీవితాలలో కొత్త వెలుగులు నింపుతున్నాయని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. కాప్రా మండల పరిధిలోని కాప్రా ,ఏఎస్ రావు నగర్, చర్లపల్లి డివిజన్ ల లబ్ధిదారులకు హప్సిగుడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో కాప్రా మండల తాసిల్దార్ ఎస్తేర్ అనిత అధ్యక్షతన బుధవారం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల 29 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని ఆడబిడ్డలకు తోబుట్టు పెద్దన్న లాగా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటూ వారి పెళ్లిళ్లకు ఒక లక్ష నూటపదహరు రూపాయల ఆర్థిక సహాయం అందించడం గొప్ప పరిణామం అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ముఖ్యంగా పేదలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారన్న ఆశాభావాన్ని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి వ్యక్తం చేశారు. ఏడాదిన్నర కరోనా కష్ట కాలం లోనూ పెళ్లైన ఆడబిడ్డలకు ఆర్థిక సహాయం అందించడంలో ఇలాంటి లోటు రానీయకుండా ఆర్థిక సాయం అందించడం జరుగుతూనే ఉందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ఓ మహా యజ్ఞంలా కొనసాగిస్తూ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తున్నాడని అన్నారు.
కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి చర్లపల్లి డివిజన్ అధ్యక్షులు డబ్బు గిరిబాబు జౌండ్ల ప్రభాకర్ రెడ్డి, ఎండి రెహమాన్ రెడ్డి నాయక్ వంశీ రాజ్ సర్ఫరాజ్ , రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.