39.2 C
Hyderabad
April 28, 2024 12: 51 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఇకనైనా పాజిటీవ్ గా ఆలోచించాలి జగన్

#Kamineni Srinivas

నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించాలని కోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం పట్ల పిటిషనర్ రాష్ట్ర మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ స్పందించారు. కోర్టు ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసింది రాజ్యాంగ ఉల్లంఘనేనని చెప్పారు.

తాను తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా అనుమతితోనే పిటిషన్ వేశానని తెలిపారు. కరోనా విజృంభణ జరుగుతోన్న సమయంలో ఆ విషయాన్ని తీసిపారేస్తూ ఏపీ ప్రభుత్వం మొదట్లో వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరంగా ఉందని కామినేని తెలిపారు.

కరోనా నేపథ్యంలో ఎస్ఈసీ ఎన్నికలు వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. ఎవరైనా ఏదైనా చేసినప్పుడు ఇకనైనా పాజిటివ్‌ గా తీసుకోవాలని ఆయన సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు.

Related posts

కరోనా కష్ట కాలంలోనూ ఆపకుండా సంక్షేమం

Satyam NEWS

కెసిఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి

Bhavani

దొరల పాలనలో రోడ్లపైకి ఆడపడుచులు

Satyam NEWS

Leave a Comment