కరోనా కష్ట కాలంలో కూడా ప్రజల అవసరాలు తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని హైదరాబాద్ లోని నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ అన్నారు. నేడు ఆమె ఎంఆర్ఓ తో కలిసి లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందచేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ముఖ్యమంత్రి సాధ్యమైన అన్ని ఏర్పాట్లు చేశారని అన్నారు. అర్హులైన వారందరికి సంక్షేమ ఫలాలు ఆగకుండా అందించారని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పకడ్బందిగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని ఆమె అన్నారు.