30.7 C
Hyderabad
April 29, 2024 06: 17 AM
Slider కరీంనగర్

సైలెన్స్ స్ట్రైక్: ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలి మౌన దీక్ష

karimnagar lover marrige silent strike

ఐదేళ్ళుగా ప్రేమించి , పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాయమాటలు ఎన్నోచెప్పి నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకో అన్నందుకు చెప్పాపెట్టకుండా ఎక్కడికో జారుకున్నాడు ఆ ప్రబుద్దుడు .మోసపోయానని గ్రహించిన ఆ యువతి ప్రియుడు ఇంటి ముందు మౌన దీక్షకి దిగింది.

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పత్తికుంటపల్లి గ్రామానికి చెందిన చంద్రమౌళి, కోట్ల నరసింహుల పల్లి గ్రామానికి చెందిన మమతకి ఐదేళ్ళ క్రితం పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వారు ఐదేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. తనకంటే ఇద్దరు పెద్ద అక్కలు ఉన్నారు. వారికి పెళ్లి కాగానే పెళ్లి చేసుకుంటానని ఆ యువకుడు యువతిని నమ్మించాడు.

చంద్రమౌలి అక్కల వివాహం అయ్యాకఆరు నెలలు గా పెళ్లి చేసుకుంచంద్రమౌళి, మమత నిశ్చితార్ధం చేసుకున్నారు. పెళ్లిచేసుకుంటానని నమ్మిస్తూనే ఉన్నాడు చంద్రమౌళి. చివరికి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని అడిగినందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మమత చంద్రమౌళి ఇంటికి చేరుకుంది. ఇంటికి ఎందుకు వచ్చావని ఆ యువకుడి కుటుంబ సభ్యులు మమతను ఇష్టం వచ్చినట్లు దూషించి కొట్టారు.

దీంతో ప్రియుడి ఇంటి ముందే ఆ ప్రియురాలు మౌన దీక్షకి దిగింది. సోమవారం రాత్రి నుండి ప్రియుడి ఇంటి ముందే బైఠాయించి తన నిరసన తెలుపుతుంది. తనకి న్యాయం జరిగే వరకు ఇంటి ముందు నుండి దీక్ష విరమించేది లేదని మమత తెలిపింది.

Related posts

వి ఎస్ యూ లో గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శులకు శిక్షణ

Satyam NEWS

ఎటాక్ ఏగైన్:ఇరాక్ లో మళ్ళి ఐదు చోట్ల రాకెట్ దాడులు

Satyam NEWS

40 లక్షల విలువైన 236 సెల్ ఫోన్లు అప్పగింత

Satyam NEWS

Leave a Comment