కర్ణాటకలో బలవంతపు మతమార్పిడి నిరోధక బిల్లుపై వివాదం కొనసాగుతోంది. కాంగ్రెస్తో సహా విపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బెల్గాంలో జరుగుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. మైనారిటీలను టార్గెట్ చేసేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
మత స్వాతంత్య్ర సంరక్షణ హక్కు చట్టం 2021 ముసాయిదాలో బలవంతపు మతమార్పిడిలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని ప్రతిపాదించారు. ఎస్సీ ,ఎస్టీ , ,మైనర్లు , మహిళలను బలవంతంగా మతమార్పిడి చేస్తే గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానాను వేయాలని ముసాయిదాలో పేర్కొన్నారు.
ఇతర వర్గాల వారిని బలవంతంగా మతం మారిస్తే…3 నుంచి 5 ఐదేళ్లవరకు జైలుశిక్ష. 25 వేల రూపాయల జరిమానా విధిస్తారు. ఇక సామూహికంగా మత మార్పిడులు చేస్తే… 3 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధించేలా బిల్లు రూపొందించారు.