36.2 C
Hyderabad
April 27, 2024 21: 59 PM
Slider కడప

తొలగించిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలి

tdp rajampet

తెలుగుదేశం పార్టీ ఇంటిలో అవ్వకో, తాతకో ఒక్కరికే ఫించన్ ఇస్తున్నదని తాను అధికారంలోకి వస్తే ఇద్దరికి ఇస్తానని చెప్పిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్న వాటిని కూడా తీసేస్తున్నాడని కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలని నేడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కోవూరు మండల పరిషత్తు ఆఫీస్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

గతంలో ముఖ్యమంత్రి చెప్పిన మాటకు కట్టుబడి రాష్ట్రంలోని ఎస్ సి, ఎస్ టి, బి సి, మైనారిటీలకు 45 సంవత్సరాలకే పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వస్తే అందరికి పింఛన్ ఇస్తానని చెప్పిన జగన్ ప్రజలను మోసం చేశాడని అన్నారు. మాట తప్పం, మడమ తిప్పం అనే జగన్మోహన్ రెడ్డి ఇది మాట తప్పడం కదా అని ఆయన ప్రశ్నించారు.

వృద్ధాప్య పింఛను అర్హత వయస్సు 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గించిన తరువాత పెరగవలసిన పింఛన్లు తగ్గాయని, 2019 వ సంవత్సరం మే నెలలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 24,03,077 వృద్ధాప్య పింఛన్లు ఉంటే, 2020 ఫిబ్రవరి నెలకు 23,89,580 కి తగ్గాయని, దరఖాస్తు చేసుకున్న 72 గంటలలోని కొత్త పింఛన్లు ఇస్తానని చెప్పి గత 8 నెలలుగా ఒక్క కొత్త పింఛను కూడా ఇవ్వలేదని అన్నారు.

ఈ నెలలో మాత్రం కొత్తగా 6లక్షల పింఛన్లు మంజూరు చేసామని చెప్పి,7 లక్షలు తొలగించారని ఆయన అన్నారు. గతములో తెలుగుదేశం ప్రభుత్వం రూ 200 ఉన్న పింఛన్ ను రూ 2వేలకు పెంచగా, వైస్సార్సీపీ ప్రభుత్వం కేవలం 250 రూపాయలు మాత్రమే పెంచి ఉన్న పింఛన్లు తొలగిస్తున్నారని, భర్త చనిపోయిన వారికి ఇచ్చే వితంతువు పింఛన్లు వయస్సు లేదని తొలగించారని అన్నారు. దీనిని బట్టి ఈ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో అర్ధమవుతుందని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తొలగించిన పింఛన్లను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ధర్నా అనంతరం ఈ ఓ పి ఆర్ డి కి వినతిపత్రం ఇచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తొలగించబడిన పెన్షన్ దారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏలూరు కృష్ణయ్య, పెనుమల్లి శ్రీహరిరెడ్డి, గునుపాటు రవీంద్రరెడ్డి, జొన్నదుల రవికుమార్ పాల్గొన్నారు. ఇంకా ఇందుపురు మురళీకృష్ణ రెడ్డి, గిద్దలూరు వెంకటేశ్వర్లు, ఒబ్బారెడ్డి మల్లికార్జున రెడ్డి,బాల రవి, యద్దలపూడి నాగరాజు,మామిడి మురళి, చామంతిపురం గౌతమ్ కలికి సత్యనారాయణ రెడ్డి,సాయి రోశయ్య,ఇంటూరు విజయ్,శివుని రమణా రెడ్డి,బుధవరపు శివకుమార్,ఆజిగంటి రమణయ్య,గుంజి పద్మనాభం,బత్తల రమేష్ తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

జనగామలో ద్విచక్ర వాహన దొంగల ముఠా అరెస్టు

Satyam NEWS

ఆన్సర్ ప్లీజ్: ట్రంప్ టూర్ కు 100కోట్ల ఖర్చా

Satyam NEWS

దళితబంధు కోసం పెద్దమల్లారెడ్డి దళితుల ఆందోళన

Satyam NEWS

Leave a Comment