38.2 C
Hyderabad
April 28, 2024 20: 27 PM
Slider ప్రకాశం

ఘనంగా కార్తీక మాసం ముగింపు వేడుకలు

#Cheemakurthy

ప్రకాశం జిల్లా చీమకుర్తి లోని  స్థానిక తూర్పు పాలెం శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం లో సోమవారం కార్తీక మాసం ముగింపు సందర్భంగా  భక్తులు విశేష పూజలు చేశారు. తెల్లవారుజాము నుండే  భక్తులు గుడికి రావటం మొదలు పెట్టారు.

ఉదయం వసుంధర ఫ్యాషన్స్ అధినేత ఈర్ల నారాయణ దంపతులు  పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో దీప కాంతులతో నిండింది. జలదుర్గం రంగ స్వామీ కార్తీక మాసం ముప్పది రోజుల పాటు  భక్తులకు  ప్రసాదాలు అందించారు.

కార్తీక మాసం చివరి రోజున  రంగ స్వామీ కి ఆలయ కమిటీ  అధ్యక్షులు పుత్తూరు  రామారావు , కోశాధికారి రామనాధం  రమణయ్య, ఆలయ అర్చకులు శ్రీధర శర్మ ఘనంగా సన్మానించారు. చివరిగా భక్తులకు ప్రసాదాలు పంచి పెట్టారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పుత్తూరు  రామారావు , కోశాధికారి రామనాధం  రమణయ్య, ఆలయ అర్చకులు శ్రీధర శర్మ ,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇంకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కరోనా

Satyam NEWS

కరోనా హెల్ప్: కూరగాయలు పంచిపెట్టిన వైసీపీ నేత

Satyam NEWS

సీనియర్ ఐఏఎస్ లను కాదని డిప్యుటేషన్ పై వచ్చిన వారికి అందలం

Satyam NEWS

Leave a Comment