ప్రకాశం జిల్లా చీమకుర్తి లోని స్థానిక తూర్పు పాలెం శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం లో సోమవారం కార్తీక మాసం ముగింపు సందర్భంగా భక్తులు విశేష పూజలు చేశారు. తెల్లవారుజాము నుండే భక్తులు గుడికి రావటం మొదలు పెట్టారు.
ఉదయం వసుంధర ఫ్యాషన్స్ అధినేత ఈర్ల నారాయణ దంపతులు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో దీప కాంతులతో నిండింది. జలదుర్గం రంగ స్వామీ కార్తీక మాసం ముప్పది రోజుల పాటు భక్తులకు ప్రసాదాలు అందించారు.
కార్తీక మాసం చివరి రోజున రంగ స్వామీ కి ఆలయ కమిటీ అధ్యక్షులు పుత్తూరు రామారావు , కోశాధికారి రామనాధం రమణయ్య, ఆలయ అర్చకులు శ్రీధర శర్మ ఘనంగా సన్మానించారు. చివరిగా భక్తులకు ప్రసాదాలు పంచి పెట్టారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పుత్తూరు రామారావు , కోశాధికారి రామనాధం రమణయ్య, ఆలయ అర్చకులు శ్రీధర శర్మ ,భక్తులు తదితరులు పాల్గొన్నారు.