26.7 C
Hyderabad
April 27, 2024 08: 48 AM
Slider ఆదిలాబాద్

అధికారం కోసం అన్నీ మోసాలే చేసిన కేసీఆర్

#MPBandiSanjayKumar

ఇంటి జాగా ఉన్న వాళ్లందరికీ 5 లక్షలిస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పి 3 లక్షలే ఇస్తానంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. మాట తప్పి తప్పు చేశానంటూ కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెంపలేసుకుని ప్రజలను క్షమాపణ కోరాలని సూచించారు. ఇండ్ల జాగా ఉన్న వాళ్లందరికీ డబ్బులిచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో ఇండ్ల నిర్మాణం కోసం కేంద్రం రూ.4 వేల కోట్లకుపైగా నిధులిస్తే… ఆ సొమ్మును దారి మళ్లించిన ఘనుడు కేసీఆర్ అని అన్నారు. ఆ నిధుల సంగతేమైందని కేంద్ర మంత్రి లేఖ రాసినా స్పందన లేదన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదన్నారు. రుణమాఫీ, డబుల్ బెడ్రూం, నిరుద్యోగ భ్రుతి, దళిత, గిరిజనులకు 3 ఎకరాలుసహా ఎన్నో హామీలిచ్చి అమలు చేయలేదన్నారు.

ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో మళ్లీ కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరదీశారన్నారు. 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయని దుర్మార్గుడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. 3వ రోజు పాదయాత్రలో భాగంగా ముథోల్ నియోజకవర్గంలోని మహాగాంకు వచ్చిన బండి సంజయ్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….

తెలంగాణనే బిజెపి అడ్డా. ఈ జోష్ చూసే… కేసీఆర్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు. కోర్టు నుంచి అనుమతి తీసుకుని సభ నిర్వహించుకున్నాం. ఫామ్ హౌస్ లో తాగి పడుకుంటున్న కేసీఆర్ ను, బయటికి గుంజుకొచ్చిందే బిజెపి. తెలంగాణలోనే పీకలేనోడు, దేశంలో ఏం పీకుతాడు? అని ప్రశ్నించారు.

మహాగాం గ్రామ సమస్యలను పరిష్కరించలేనోడు… దేశ సమస్యలను పరిష్కరిస్తాడా?. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ… కేసీఆర్ నోటికి మాటలు ఎక్కువ. కేసీఆర్ ఇంట్లో ముఖ్యమంత్రి పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయిందని బండి అన్నారు.
ఈ గ్రామంలో రోడ్లు లేవు… తాగునీటి ఊసే లేదు. మిషన్ భగీరథ పథకం కింద ఈ గ్రామానికి నీళ్లు రావడం లేదు. ఇది కేసీఆర్ కు కనబడటం లేదా? కెసిఆర్ నోరు తెరిస్తే… అన్నీ అబద్ధాలే చెప్తాడు. కెసిఆర్ ది నోరా… తాటిమట్టా? అని ధ్వజమెత్తారు.. బండి సంజయ్.మహారాష్ట్రలో ఒక్కరోజే లక్ష గృహప్రవేశాలు చేసిన చరిత్ర బిజెపిదని..ప్రజలను మోసం చేస్తున్న మూర్ఖుడు కేసీఆర్. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. బిజెపినే అధికారంలోకి వస్తుంది. బిజెపి అధికారంలోకి వచ్చాక, నిలువు నీడలేని పేదలకు ఇండ్లను కట్టించే బాధ్యత తీసుకుంటామన్నారు… బీజేపీ అధ్యక్షుడు.ఎన్నికలప్పుడు తప్పుడు హామీలతో ఓట్లు వేయించుకుంటాడు. ఆ తర్వాత లా పత్తా లేకుండా పోతాడు.

అసెంబ్లీ సమావేశాలను పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని వెంటాడుతాడట. దమ్ముంటే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలను చర్చించాలని డిమాండ్ చేశారు… కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు.. నిరుద్యోగ భృతి లేదు. రెండు నెలల లోపట లక్షా 46 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిది. రుణమాఫీ హామీ ఏమైంది? పంట నష్టపోయిన రైతుకు నష్టపరిహారం ఇచ్చాడా? రైతుబంధు పేరుతో మిగిలిన అన్ని సబ్సిడీలను ఎత్తేశాడని ఆరోపించారు.ఎరువులపై రైతులకు దాదాపు 36వేల రూపాయల సబ్సిడీ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే.

పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తున్నది మోడీ ప్రభుత్వమే. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నాడని ధ్వజమెత్తారు.సంవత్సరం నుంచి ప్రజల కోసమే పాదయాత్ర చేస్తున్న. కరోనా సమయంలో ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత, భారతీయ జనతా పార్టీ దే. కెసిఆర్ ను చూసి దేశం నవ్వుతోందని… ఇజ్జతి పోతోందని… తెలంగాణకు ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రైతన్నల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.. బండి సంజయ్.

వడ్ల కుప్పలపై రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిని చూస్తున్నాం. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. సిరిసిల్లలో ఓ విద్యార్థిని మూల్యాంకనంలో కేసీఆర్ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆత్మహత్య చేసుకుందన్నారు.

37 మంది విద్యార్థులు చనిపోయారు. …విద్యార్థుల తల్లిదండ్రులపై లాఠీచార్జి చేయించిన మానవత్వం లేని మానవ మృగం కేసీఆర్. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నదే కేసీఆర్. గ్రామ పంచాయతీలకు కేసీఆర్ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని అన్నారు… టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులను ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ… కేంద్రం ఇస్తున్న నిధులతోనే. ఈ మూర్ఖుడి నిర్లక్ష్యంతో తెలంగాణలో పేదలు బతకలేని పరిస్థితి నెలకొందన్నారు.గురుకుల పాఠశాలల్లో పురుగుల అన్నం, విషపన్నం పెడుతున్నారు. బాసర త్రిబుల్ ఐటీలో సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు రోడ్డుకెక్కిన పరిస్థితి. బాసర విద్యార్థులను బెదిరిస్తున్న మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి అని బండి తీవ్ర ఆరోపణలు చేశారు.

కేసీఆర్… కేసీఆర్ కొడుకు, కేసీఆర్ బిడ్డపై ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసునని.. ఐదు సంవత్సరాల్లో దేశం కోసం, ధర్మం కోసం ఏడుసార్లు జైలుకు వెళ్లాను. ప్రజల కోసం ఉద్యమం చేస్తుంటే… రౌడీషీట్లు పెట్టి, జైల్లోకి పంపిస్తున్నాడని వాక్బాణాలు సంధించారు.. బండి సంజయ్.అన్ని వర్గాలను మోసం చేసిన ఘనుడు కేసీఆర్ అని…. దళితుడిని ముఖ్యమంత్రి దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు హామీని అమలు చేయని మూర్ఖుడు కేసీఆర్. గొల్ల కురుమలను మోసం చేసిన మూర్ఖుడు కేసీఆర్ అని ధ్వజమెత్తారు.. అన్ని బీసీ కులాలను మోసం చేసిండు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నాడని ఆరోపించారు.దేశంలో 27 మంది బీసీలను, 12 మంది ఎస్సిలను, 8 మంది ఎస్టీలను మంత్రులను చేసిన ఘనత మోడీదన్నారు. పోలీస్ కిష్టయ్య లాంటి అమరుల త్యాగఫలమే నేటి తెలంగాణ. శ్రీకాంతాచారి, సుమన్ ల బలిదానంతోనే తెలంగాణ వచ్చిందన్నారు.

మఉద్యమంలో దొంగ దీక్ష చేసినోడు కేసీఆర్ అని ఆరోపించారు… తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. ఢిల్లీలో పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే… ఒక్కరోజు కూడా పార్లమెంటుకు రానోడికి కేసీఆర్. పేదోళ్ల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో… పెద్దోడు రాజ్యమేలుతున్నాడని విమర్శించారు. కెసిఆర్ గడీల్లో తెలంగాణ తల్లి బందీ అయిందన్నారు… బండి సంజయ్.తెలంగాణ తల్లిని బంధ విముక్తి రాలిని చేద్దామని.. ప్రజా సంగ్రామ యాత్రలో ఎక్కడికి వెళ్లినా… ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి, తమ బాధలను చెప్పుకుంటున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. మహాగాం ప్రజలకు 24 గంటలు బిజెపి అండగా ఉంటుందన్నారు.. బండి సంజయ్.

Related posts

The Power House: కరెంటు కష్టాలకు చరమగీతం  పాడిన రాష్ట్రం

Satyam NEWS

భారత క్రికెట్ కు మళ్లీ దొరికిన వాల్

Satyam NEWS

హుజూర్ నగర్ నియోజకవర్గంలో మిన్నంటిన టిఆర్ఎస్ శ్రేణుల నిరసనలు

Satyam NEWS

Leave a Comment