31.7 C
Hyderabad
May 2, 2024 09: 29 AM
Slider కరీంనగర్

కెసిఆర్ వల్లనే సంక్షేమ పథకాలు పొందినం..

#gangula

తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్ నరహరి.

హైదరాబాద్,సత్యం న్యూస్: బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ వల్లనే సంక్షేమ పథకాలు సంచార జాతులకు అందాయని తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్ నరహరి అన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బిఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ను సంచార జాతుల ప్రతినిధులతో కలిసి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు ప్రచారం నిర్వహించి గంగుల కమలాకర్ను గెలిపించాలని ప్రజలు ఓటర్లను కోరారు. అనంతరం నరహరి మాట్లాడుతూ సంచార జాతులను గుర్తించి ఏకతాటిపైకి తీసుకొచ్చి వారిని అభివృద్ధి బాటలో నడిపించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. సంచార జాతులకు డబల్ బెడ్ రూమ్, బీసీ బందు పథకం, అర్హులైన అందరికీ పెన్షన్, కళ్యాణ లక్ష్మి, ఇతర సంక్షేమ పథకాలను అందించారని కొనియాడారు. అనునిత్యం సంచార జాతుల గురించి పట్టించుకునే గంగుల కమలాకర్ నాయకత్వాన్ని బలపరచాలని జరగబోయే ఎన్నికల్లో ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సంచార జాతి కుటుంబాలకు వివరించి చెప్పడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ప్రచారం ముగిసే వరకు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తిరుగుతూ మద్దతు కూడా కడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య నాగరాజు, హగుళూరు శీను, జంగం సిద్దేశ్వర్, అఖిల్, రాయమల్లు, ఆవుల తిరుపతి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్,సత్యం న్యూస్

Related posts

కీసరలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి: దొరికిన అమ్మాయిలు

Satyam NEWS

పీఎం భద్రతా వైఫల్యంపై నవీన్ ట్వీట్‌

Sub Editor

మత మార్పిడులను సహించేది లేదు

Satyam NEWS

Leave a Comment