కడప పట్టణంలోయన్.ఆర్.సి, యన్.పి.ఆర్ సి.ఏ.ఏ చట్టాలకు వ్యతిరేకంగా కడప (జెఎసి) ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ వద్ద జరుగుతున్న షాహీన్ బాగ్ రిలే నిరాహార దీక్షలకు విజయవాడ లోక్ సభ సభ్యులు కేశినేని నాని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యన్.ఆర్.సి, సి.ఏ.ఏ, యన్.పి.ఆర్ బిల్లు పెట్టడం పేద తరగతి మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాష సి.ఏ.ఏ, యన్.పి.ఆర్, బిల్లులపై అవగాహన లేక బిల్లుకు మద్దతు తెలిపాము అని చెప్పారు. అవగహన లేని వారికి పదవులు ఎందుకు? అధికార వైసీపీ పార్టీ అసెంబ్లీలో వ్యతిరేకంగా తీర్మానం చేస్తే టీడీపీ తరపున మేము మద్దతు ఇస్తాం. ఒకవేళ మా పార్టీ మద్దతు ఇవ్వకపోతే నేను పార్టీకి పదవికి రాజీనామా చేస్తా. పార్లమెంట్ లో సి.ఏ.ఏ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీలు విప్ జరిచేశాయి. దాని వల్ల నేను పార్లమెంట్ లోంచి బయటకు వచ్చానని సృష్టం చేశారు.