హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహ తయారీ పూజ ప్రారంభం అయింది. ఈ సారి 9 అడుగుల ఎత్తులో శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతి గా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనం ఇస్తాడు. ఖైరతాబాద్ లో గణేషుడి విగ్రహం స్థాపించడం ప్రారంభించి ఇది 66 వ సంవత్సరం.
ఈ సారి మహావిష్ణువు రూపంలో దర్శానమివ్వనున్న ఖైరతాబాద్ గణనాథుడికి ఒక వైపు లక్ష్మిదేవి మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. కరోనా కారణంగా నిమజ్జన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగే అవకాశం కనిపించడం లేదు. అందువల్ల పర్యావరణ హితంగా ఖైరతాబాద్ గణ నాధుడిని మట్టితో తయారు చేసి అదే ప్రదేశంలో నిమజ్జనం చేసేలా ఏర్పాటు చేస్తున్నారు.
ఏ కార్యక్రమానికి కూడా భక్తులు ఎవ్వరు రావద్దని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కోరింది. ఆన్ లైన్ ద్వారా దర్శనం చేసుకుని ఖైరతాబాద్ వినాయకుడి అనుగ్రహకు పాత్రులు కావాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది.