అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను ఎమ్మెల్యే విడుదల రజినీ వర్గీయులు అడ్డుకున్నారు. వైసీపీ వైకాపా కార్యకర్త గంటా హరికృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఎంపీని ఎమ్మెల్యే వర్గీయులు గ్రామంలో అడుగు పెట్టనివ్వలేదు.
స్థానిక వైసీపీ నాయకుడు కోటిరెడ్డి ఎంపి పర్యటనకు అడ్డుపడి తమకు సమాచారం ఇవ్వకుండా గ్రామంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. పరామర్శ కోసం మాత్రమే వచ్చానని ఎంపి చెప్పినా ఆయన పట్టించుకోలేదు. ఎంపీ వాహనానికి అడ్డుపడి ఎంపీతో వాగ్వాదానికి దిగారు. దాంతో పోలీసులు సాయంతో అక్కడి నుంచి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు బయటపడ్డారు. అనధికార కార్యక్రమాలకు సైతం ఇబ్బందులు కలిగించటం సరికాదని ఎంపీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.