28.7 C
Hyderabad
April 27, 2024 04: 03 AM
Slider విజయనగరం

ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ను కలిసిన ఏపీయూడబ్ల్యూజే…!

#apuwj

“సేవ్ జర్నలిజం” అంటూ వినతిపత్రం ఇచ్చిన జర్నలిస్టులు…!

‘సేవ్ జర్నలిజం’ పేరుతో జాతీయ జర్నలిస్ట్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ఆయా రాష్ఠ్రాలలో ఉన్న యూనియన్ సంఘాలు సంఘటితమై…ఆయా జిల్లా ల పరిధుల్లో జిల్లా కలెక్టర్ ను కలిసి విజ్ఞాపన పత్రాలు అందజేస్తున్నాయి.అందులో భాగంగా ఏపీయూడబ్ల్యూజే విజయనగరం జిల్లా శాఖ…కలెక్టర్ ఛాంబర్ లో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ,కలెక్టర్ అయిన సూర్య కుమారిని కలిసి వినతిపత్రం ఇచ్చారు.

రాష్ట్ర శాఖ పేర్కొన్న ఆదేశాలను ఉటంకిస్తూ.. అలాగే “సేవ్ జర్నలిజం” అంటూ కలెక్టర్ ను అభ్యర్ధించారు.జిల్లా లో అలాగే స్థానికంగా ఏళ్ల తరబడి పేరుకు పోయిన మా సమస్యలు ను పరిష్కరించి….జర్నలిజం ను పరిరక్షించాలని యూనియన్ నేతలు పీఎస్.వీ.వీ ప్రసాద్(శివ) జీ.వరప్రసాద్ ,పాత్రో ,పంతులు, అప్పారావు, శర్మ , డేవిడ్,రమణయ్య , త్రినాథ్ లు కలెక్టర్ ను వినమ్రంగా కోరారు. యూనియన్ నుంచీ వినతిపత్రం అందుకున్న కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని స్పష్టం చేశారు.

Related posts

పోలీస్ స్టేషన్ లోనే రిలే నిరాహార దీక్షలు

Satyam NEWS

మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ

Satyam NEWS

నో నో: మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి రానంటే రాను

Satyam NEWS

Leave a Comment