30.7 C
Hyderabad
April 29, 2024 05: 16 AM
Slider ఆధ్యాత్మికం

అశ్వ‌వాహ‌నంపై శ్రీకోదండరామస్వామి ద‌ర్శ‌నం

#aswavahanam

ఉమ్మడి కడప జిల్లా  ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం రాత్రి అశ్వ‌వాహ‌నంపై స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చారు. రాత్రి 7 గంటలకు స్వామివారి వాహన సేవ ప్రారంభమైంది.  వాహనసేవ ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనం అధిష్టించి  భక్తులకు కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తున్నారు. తన నామ సంకీర్తనతో కలిదోషాలకు దూరంగా ఉండమని ప్రబోధిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నటేష్ బాబు, ఏఈఓ గోపాల్ రావు, సూపరింటెండెంట్   సుబ్రహ్మణ్యం, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ ధనుంజయులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

విశేషంగా ఆకట్టుకున్న ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు

శ్రీ కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం టీటీడీ  హిందూ ధార్మిక ప్రాజెక్టులు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఉదయం 10 నుండి 11 గంటల వరకు డాక్టర్ చంద్రశేఖర రావు బృందం “అశ్వమేధ యాగం” పై ఆధ్యాత్మిక ప్రసంగం నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు అనుగ్రత బృందం ఆలపించిన ” రామ రామ రామాయ నర….., బావయామి రఘురామం…., రామ మంత్ర జపసో….” సంకీర్తనలు భక్తులను  అలరించాయి. రాత్రి 7 గంటల నుండి  రాముడు భాగవతర్ “సుందరకాండ” హరికథ పారాయణం నిర్వహించారు.

Related posts

ప‌ట్టుకున్న విలువ త‌క్కువే..కానీ సినీ ఫ‌క్కీలో కేస్ ను ట్రేస్ చేసిన ఎస్ఐలు…!

Satyam NEWS

ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు అనునిత్యం తపన

Satyam NEWS

మత్స్య కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా నూతన కమిటీ ఎన్నిక

Satyam NEWS

Leave a Comment