రాష్ట్ర మంత్రి కేటీఆర్ అక్రమంగా నిర్మించుకున్న ఫామ్ హౌస్ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీస్ లు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం హేమమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లు రవి అన్నారు.
డీసీసీ అధ్యక్షులు వంశీ కృష్ణ, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రంగినేని జగదీశ్వరులు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు గాలి యాదవ్, కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పరశురాం నాయుడు తదితరులు పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఉన్నారు.
కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ రాష్టంలో కేసీఆర్ నియంత పాలన తో ప్రజా గొంతుకలను నొక్కేస్తున్నాడని అన్నారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ప్రతిపక్షాలపై అక్రమ కేస్ లు బనాయిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహేళన చేస్తున్నాడని ఆయన ఆరోపించారు.
ఫామ్ హౌస్ నిర్మాణం అక్రమ నిర్మాణం కానప్పుడు కేసీఆర్ కు ఎందుకు ఇంత భయం పట్టుకుందని దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రిమాండ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ని వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కంటి శివన్న, గోపాల్, ఖాదర్, క్రాంతి, కురుమయ్య, మధు, బాబా, పరుశురాం, యాదవ్, రఫీ తదితరులు పాల్గొన్నారు.