28.7 C
Hyderabad
April 27, 2024 04: 27 AM
Slider నల్గొండ

హుజూర్ నగర్ లో ఘనంగా శీతలా పరమేశ్వరి ప్రతిష్టాపన

#sheetalaparameswari

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండల మర్రిగూడెం గ్రామంలో సోమవారం బొడ్రాయి(శీతలా పరమేశ్వరి) ప్రతిష్ట,ధ్వజ ప్రతిష్ఠ, ముత్యాలమ్మ గుడి  ప్రారంభ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ గ్రామంలో అరుదైన విషయం  గ్రామంలో హిందువులు,ముస్లింలు కలిపి చందాలు వేసుకొని ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించుకోవడం గొప్ప విశేషం.ఈ గ్రామంలో హిందువుల ఓట్లు 350,ముస్లిం ఓట్లు 300 ఉన్నాయి.

ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ కమిటీ సభ్యుడు యరగాని నాగన్నగౌడ్ మాట్లాడుతూ మతాలకతీతంగా లక్షలాది రూపాయలు ప్రజలే స్వయంగా ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కో- ఆప్షన్ సభ్యుడు సయ్యద్ అభిద్ అజ్మతుల్లా,వార్డు సభ్యులు గౌస్ రబ్బానీ,సింగిల్విండో డైరెక్టర్ మొక్క ఆదినారాయణ,మాజీ వార్డు సభ్యుడు జోగేశ్వరరావు,మసమాలీ,కాంగ్రెస్ నాయకులు మోదాల సైదులు యాదవ్, మేళ్ళచెరువు ముక్కంటి,పోతనబోయిన రామ్మూర్తి,గడ్డం అంజయ్య యాదవ్,మేకల మధు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సత్యంన్యూస్, హుజూర్ నగర్

Related posts

విశాఖ నుంచి తెలంగాణ మంత్రి మాట్లాడుతూ…

Satyam NEWS

అత్తి వరదరాజస్వామి సేవలో కేసీఆర్

Satyam NEWS

ఘనంగా గ్రామ కాంగ్రెస్ నాయకుడి కుమార్తె ఎంగేజ్ మెంట్

Satyam NEWS

Leave a Comment