నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణం సమీపంలోని రామాపురం వద్ద ప్రభుత్వం వన్ నిర్మించిన 50 పడకల మాత శిశు సంరక్షణ ఆసుపత్రిని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ శనివారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు.
ఆస్పత్రి వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని వసతులతో ఉన్న 50 పడకల మాతాశిశు సంరక్షణ ఆసుపత్రిని ఈనెల 25వ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఉమ్మడి జిల్లాలోని అన్ని వసతులు కలిగిన మొదటి మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి అని కలెక్టర్ అన్నారు.
కొల్లాపూర్ ప్రజలకు అన్ని సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి అందుబాటులోకి రానున్నట్లు ఆయన వెల్లడించారు.
కలెక్టర్ వెంట డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్, ఆసుపత్రి సూపర్-ఇండెంట్ భరత్, ఇతర వైద్యులు తదితరులు వెంట ఉన్నారు.స్థానిక నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జి నరేందర్ రెడ్డి, కాటం జంబులయ్యా, మాజీ ఉప సర్పంచ్ చంద్ర శేఖర చారి, కె. నిరంజన్, ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు ఉరి హరికృష్ణ, కేశవులు, సింగల్ విండో డైరెక్టర్ పరశురామ్,మాజీ మంత్రి జూపల్లి అనుచరులు ఉన్నారు.