హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న చంద్రయ్య అనే వ్యక్తిని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి నేడు పరామర్శించారు.
పాన్ గల్ మండలం బూసిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి స్వయంగా నిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి చంద్రయ్య పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. తదనంతరం డాక్టర్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో పాటు జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాముర్తి నాయుడు ఉన్నారు.