నెల్లూరు జిల్లాలో ఇందుకూరుపేట- తోటపల్లి గూడూరు మండలాలకు ముఖ ద్వారమైన మైపాడు గేటు రోడ్డు వెడల్పుతో ఈ ప్రాంతానికి చాలా మేలు జరుగుతుందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం మైపాడు గేటు రోడ్డు సెంటర్లో నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి రోడ్డు వెడల్పు కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఈ ప్రాంతం ఎంతో అందంగానూ, సౌకర్యవంతంగానూ తయారవుతుందని, తద్వారా నగర ప్రజలకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదాలకు పలువురు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి, నరసింహారావు, అల్లా బక్షు, శ్రీధర్ రెడ్డి, మధు, కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, అభిమానులు పలువురు పాల్గొన్నారు.