తెలంగాణాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా కోరారు.
రానున్న రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని నది ప్రవాహం , లోతట్టు ప్రాంతంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా కోరారు.
ప్రాజెక్టులలో, వాగులలో చేపలుపట్టేందుకు మత్స్యకారులు వెళ్లారాదని, ఎలాంటి ప్రమాదం సంభవించిన వెంటనే టోల్ ఫ్రీ నంబరు 08733-279333 సంప్రదించాలని అన్నారు.
ఈ రోజు పెంచికల్ పేట,బెజ్జురు మండలాల లోతట్టు ప్రాంతాల లో ఆయన పర్యటించారు.