నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం లోని చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో శ్రీ కృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిరాడంబరంగా పెద్దమ్మ తల్లి బొనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ అధ్యక్షులు కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో రాగి వేప మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవచింతన కల్గి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణా యాదవ సంఘం సభ్యులు,గొల్లపల్లి ఉపసర్పంచ్ నక్కనమోని ప్రేమలత పరమేశ, వార్డు సభ్యుడు నక్కనమోని శ్రీను పాల్గొన్నారు
ఇంకా, యాదవులు, నక్కనమోని నాగరాజు, చాట జంగయ్య,నర్సింహ్మా, యాదయ్య,మల్లేష్,సత్తారి, వెంకటయ్య,మహేష్,మల్లేష్, కడారి వెంకటయ్య, సాయి, శ్రీశైలం, మహేష్, నక్కనమోని యాదగిరి, మల్లేష్, రామకృష్ణ, లక్ష్మణ్, జంగయ్య,గణేష్ తదితరులున్నారు.