మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో అధివాసి నాయకులు ఏర్పాటు చేసిన కొమురం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ జల్ జంగిల్ జమీన్ కోసం ఆదివాసుల హక్కుల కోసం కృషి చేసిన మహనీయుడు కొమురం భీం అని తెలిపారు.
ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక కొమురం భీమ్. స్వయంపాలన, అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క భీం. పోరాట పంథానే చివరకు సరైన మార్గమని, తన జాతి ప్రజలను విముక్తి చేస్తుందని అక్షరాల నమ్మిన ఆదివాసీ పోరాట యోధుడు ఆయన స్పూర్తి తో ఆదివాసులు పోరాటాలకు సిద్దం కావాలని సీతక్క అన్నారు.
ఈ కార్యక్రమంలో విగ్రహావిష్కరణ కమిటీ తో కాంగ్రెస్ పార్టీ జిల్లా,మండల నాయకులు కార్యకర్తలు ఎంపీటీసీ లు సర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులు ఆదివాసీ ఉద్యమం నాయకులు ప్రజలు పాల్గొన్నారు.