పౌర్ణమి సందర్భంగా జనవరి 6న అరుణాచలం లో జరిగిన గిరి ప్రదక్షణ కు ప్రయాణీకుల రద్దీ పెరిగిన దృష్ట్యా గుంటూరు 2 డిపో నుండి 2 స్పెషల్ హైటెక్ బస్ లు ఏర్పాటు చేశారు. ఈ బస్ లు జనవరి 4 వ తారీకు రాత్రి 10:30 గంటలకు గుంటూరు లో బయలు దేరి, శ్రీ కాళహస్తి, కాణిపాకం,శ్రీ పురం గోల్డెన్ టెంపుల్ దర్శించు కొంటూ జనవరి
6 తేదీన సాయంత్రం కి అరుణా చలం చేరుతుందని, అరుణా చలేశ్వరుని దర్శిచుకొని జనవరి 7వ తారీకు సాయంత్రం అరుణాచలం లో బయలు దేరి 8వ తారీకు ఉదయం 6:30 గంటలకు గుంటూరు చేరుతుందని డిపో మేనేజర్ యస్ కె అబ్దుల్ సలామ్ ఒక ప్రకటనలో తెలయజేశారు.
ఈ సర్వీస్ లకు టికెట్ లను online లో బుక్ చేసుకొనే సదుపాయం కల్పించామని, సర్వీస్ నంబర్లు 96089,96174 గా నిర్ణయిం చామని, ఈ సదవకాశం ను గుంటూరు పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలని ఒకో టికెట్ ధర 2900/- రూ. మాత్రమే నని, అదనపు సమాచారం కోసం 7382894476,7382894486, 7382896403,9959225421 నంబర్ లను సంప్రదించాలని కోరారు.