38.2 C
Hyderabad
April 29, 2024 12: 45 PM
Slider ఖమ్మం

ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

#khammam

కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతి మైదానంలో జరుగనున్న 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లును పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక, ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ కాంతారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. 15వ తేదీ ఉదయం 11 గంటలకు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. తదుపరి ముఖ్య అతిధి జిల్లా ప్రజను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. పాఠశాలల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి, అధికారులకు ప్రసంశా పత్రాలు జారీ, అసెట్స్ పంపిణీ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన స్టాళ్ల పరిశీలన ఉంటుందని చెప్పారు. అధితులు, ఆహూతులు కూర్చోనేందుకు వీలుగా షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. మంచి నీరు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పోలీస్ పరేడ్, గౌరవ వందనం వివరాలను రిజర్వ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుల్లయ్య, మున్సిపల్ ఏఈ రాము, టిపిఓ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

బస్సును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

Bhavani

31వ రోజుకు చేరిన గడపగడపకు బిజెపి ప్రజా యాత్ర

Satyam NEWS

అన్నమయ్య ప్రాజెక్టు నిండడంతో చెయ్యేటికి నీటి విడుదల

Satyam NEWS

Leave a Comment