సినిమా షూటింగ్ కోసం వెళ్లిన ప్రముఖ టాలీవుడ్ నటుడు.. మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్గా తేలింది.
ఆచార్య సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు కోవిడ్ పరీక్ష చేయించుకోగా ఆయనకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్ వేదికగా తెలిపారు. ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని, కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను’అని చిరంజీవి తన ట్వీట్లో తెలిపారు.
కాగా, మూడు రోజుల క్రితమే చిరంజీవి, నాగార్జునలు సీఎం కేసీఆర్తో కలిసి వరదముంపు సహాయాన్ని అందించడం, సినిమా ఇండస్ర్టీకి సంబంధించిన విషయాలను సీఎంతో పంచుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కూడా సానుకూలంగా స్పందించి హైదరాబాద్లో సినీ స్టూడియో నిర్మాణానికి స్థలం ఇస్తామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్కుమార్, తన తనయుడు రామ్చరణ్తో చిరంజీవి సెల్ఫీ కూడా దిగారు. ఈ నేపథ్యంలో చిరంజీవికి కరోనా పాజిటివ్ రావడంతో ఇటు రాజకీయ వర్గాల్లో, అటు సినీవర్గాల్లోనూ కలకలం రేగుతోంది. చిరంజీవి ఆరోగ్యంగా ఉండాలని ఆయన అభిమానులు భగవంతున్ని కోరుకుంటున్నారు.