చంద్రయాన్- 3 విజయవంతం కావడం పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన దేశ, విదేశాలలో నివసిస్తున్న, స్థిరపడిన భారతీయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఇది సువర్ణాక్షరాలతో లిఖించవలసిన చారిత్రాత్మక రోజు అని పేర్కొన్నారు.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై సురక్షితంగా ల్యాండ్ అయ్యి చంద్రయాన్- 3 విజయవంతమవ్వడంతో ప్రజలలో ఆందోత్సాహాలు వెల్లి విరిశాయన్నారు.చందమామ దక్షిణ ధ్రువంపై అడుగిడిన తొట్టతొలి దేశం గా భారత్ పేరుప్రఖ్యాతులు ప్రపంచం నలుదిశలా చాటిచెప్పిన ఇస్రో ఛైర్మన్ సోమనాథ్, శాస్త్రవేత్తలు, చంద్రయాన్-3 బృందాన్ని ఎంపీ వద్దిరాజు అభినందించారు.