బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,తెలంగాణ రాష్ట్ర పురపాలక &ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇచ్చిన మాట నిలుపుకున్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసరా గ్రామానికి చెందిన తెలంగాణ మలి విడత ఉద్యమకారులు గజ్జి మల్లికార్జున్ గథ కొద్ది నెలల క్రితం మృతిచెందగా ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, ఆ బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ మాట యిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గత కొద్దిరోజుల క్రితం దివంగతుడైన గజ్జి మల్లికార్జున్ ప్రథమ కుమారుడు యువరాజ్ కు భూపాలపల్లి జెన్ కో నందు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగం ఇప్పించగా ఈరోజు ఆయన రెండో కుమారుడైన గణేష్ హైదరాబాదులోని సెయింట్ మేరీస్ కళాశాలలో ఇంటర్ చదువుతుండగా ఆయన కళాశాల ఫీజులు నిమిత్తం అతనికి 50వేల రూపాయలను చెక్కు రూపంలో ఆర్థిక సహాయంగా పంపించారు. వాటిని రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి, ములుగు జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి ,గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్, స్థానిక ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక మండల BRS నాయకులు,ప్రజా ప్రతినిధులతో కలిసి గణేష్ కు అందజేశారు.