తాగి వాహనం నడిపిన కేసుకు సంబంధించి ప్రముఖ సినీ, టీవీ ఆర్టిస్టు ప్రిన్స్ సుశాంత్ కు కూకట్ పల్లి కోర్టు 5 వేల రూపాయల జరిమానా విధించింది. ప్రిన్స్ సుశాంత్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నేడు కూకట్ పల్లి కోర్టు ఎదుట హాజరు అయ్యారు. ఈనెల 24వ తారీఖున కూకట్ పల్లి ప్రాంతం లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో అతనికి 48 పాయింట్లు వచ్చాయి. దాంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. నేడు న్యాయమూర్తి ఎదుట హాజరు కాగా ప్రిన్స్ సుశాంత్ కు 5 వేల జరిమానా విధించారు.
previous post
next post