విజయనగరం జిల్లా కు కొత్తగా వచ్చిన లేడీ ఎస్పీ దీపికా ఎం పాటిల్… తొలిసారిగా ఏజన్సీ ఏరియాలో పర్యటించారు. ఈ మేరకు పార్వతీ పురం డివిజన్ లో పర్యటించారు.తన పర్యటనలో పార్వతీపురం పట్టణ పీఎస్ ను సందర్శించారు.అలాగే స్టేషన్ లో రికార్డులను, సీడీ ఫైల్స్ ను, రిసెప్షన్ ను పరిశీలించారు.
అనంతరం, మహిళా పోలీసులతో సమావేశమై వారి ప్రాజెక్టు వర్క్ గురించి అడిగి తెలుసుకొని, విధి నిర్వహణలో వారి సందేహాలను నివృత్తి చేసి, పోలీసు సిబ్బందితో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకొని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు.
ఎస్పీ వెంట పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్, పార్వతీపురం సీఐ విజయానంద్, ఎస్ఐ కళాధర్ ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.