లో ప్రెషర్ మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామని అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ అన్నారు. అంబర్ పేట డివిజన్ పరిధిలోని హైమద్ నగర్ ఏరియాలో లో ప్రెషర్ తో మంచినీరు సరిగ్గా రాక స్థానిక ప్రజలు తన దృష్టికి తీసుకురావడంతో సంబంధిత అధికారులతో కలిసి సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని తెలిపారు. రఘునాథ్ నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను పరిశీలించి త్వరిత గతిన పనులను పూర్తి చేయాలని పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, రోడ్డుపై నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ యాదగిరి రెడ్డి, లైన్మెన్ సతీష్, సంబంధిత కాంట్రాక్టర్, స్థానిక బస్తి ప్రజలు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జాకీ బాబు, మహేష్ ముదిరాజ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్