29.7 C
Hyderabad
April 29, 2024 10: 09 AM
Slider నల్గొండ

ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి నిండు ప్రాణాన్ని కాపాడుదాం

#donate blood

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రయివేట్ వైద్యశాలలో గురువారం గర్భిణీ మహిళకు ‘ఓ’ పాజిటివ్ రక్తం అత్యవసరంగా కావాలని నాగమణి అనే మహిళ జనచైతన్య ట్రస్ట్ సభ్యులు పి.వంశీ,పారా.సాయి,శివశంకర్ లకు సమాచారం ఇవ్వడంతో తక్షణమే స్పందించిన జనచైతన్య ట్రస్ట్ ఉపాధ్యక్షుడు పిల్లి శివశంకర్ ‘ఓ’ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ డోనర్ ఇంజమూరి జయంత్ ను సంప్రదించి వైద్యశాలకు పంపి కోదాడ లోని తిరుమల బ్లడ్ బ్యాంకు వద్ద రక్తదానం చేశారు.

ఈ సందర్బంగా జనచైతన్య ట్రస్ట్ ఉపాధ్యక్షుడు పిల్లి శివశంకర్ మాట్లాడుతూ రక్తదానం చాలా గొప్ప పననని,మనం రక్తాన్ని సృష్టించలేము కానీ దానం మాత్రమే చేయగలమని అన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి రెండు,మూడు మార్లు రక్తదానం చేయవచ్చని,మనం చేస్తున్న రక్తదానం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుందని అన్నారు. రక్తదానానికి కుల మతాలు లేవని,ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని,ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి నిండు ప్రాణాలను కాపాడుదామని అన్నారు.

రక్తదానం చేసిన తన మిత్రుడు జయంత్ కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

హాలీడే: హోలీ డే: చైతన్య పురి లో మార్నింగ్ వాక్

Satyam NEWS

యుద్ధం కారణంగా అలమటిస్తున్న దేశాలకు ఆహార పదార్ధాలు ఇస్తాం

Satyam NEWS

బాలిక అని కూడా చూడకుండా పైశాచికత్వం

Satyam NEWS

Leave a Comment