లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నరసరావుపేట బ్రాంచ్ ప్రధాన కార్యాలయం ముందు ఒక రోజు సమ్మె గురువారం నిర్వహించారు.
ఈ సమ్మె కార్యక్రమంలో ఎల్.ఐ.సి ఏజెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈవూరి మస్తాన్ రెడ్డి, ఏ.ఐ.టి.యు.సి జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు, పశ్చిమ గుంటూరు జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షులు కామినేని రామారావు, సమాఖ్య ఆంధ్రప్రదేశ్ ముస్లిం జెఏసి. రాష్ట్ర కన్వీనర్ యస్ కె. జిలానిమాలిక్,
సి.ఐ.టి.యు నరసరావుపేట మండలం కార్యదర్శి షేక్ శిలార్ మసూద్,ఏ.ఐ.టి.యు.సి నరసరావుపేట ఏరియా కార్యదర్శి వైదన వెంకట్,ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ నరసరావుపేట బ్రాంచ్ అధ్యక్షులు ఎస్.యమ్. వలి, సెక్రటరీ కె.ఎస్ అక్బర్,
ఎల్.ఐ.సి ఎంప్లాయిస్ యసీ,ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు,బి.నాగరాజు, పి.ఏడుకొండలు,ఎల్.ఐ.సి నరసరావుపేట బ్రాంచ్ ఆపిసర్స్ అసోసియేషన్ నాయకులు కె. సుబ్బారావు,ఎల్.ఐ.సి. నాయకులు బి. మస్తాన్, షేక్ హుస్సేన్, కెనాడి తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలు ప్రేవేటికరణను నిలిపివేయాలని, స్టాక్ మార్కెట్ లో ఎల్.ఐ.సి. సంస్థను పెట్టారాదాని,ఉద్యోగుల వేతన సవరణ వెంటనే అమలు చేయాలని, ప్రజల డబ్బులకు రక్షణగా వుండే సంస్థలను కాపాడాలని, జాతీయ సంస్థలను పరిరక్షించాలని పలు నినాదాలతో సమ్మె నిర్వహించారు