హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తిని హుజూర్ నగర్ డి ఎస్ ఆర్ ట్రస్టు రక్తదానంతో ఆదుకుంది. నల్లగొండకి చెందిన అనుముల శ్రీనివాస చారి (35) అనారోగ్యంతో హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి సిటిజన్ హాస్పిటల్ లో చేరాడు. అతనికి తదుపరి చికిత్స చేసేందుకు రక్తం అవసరమైంది.
డాక్టర్లు బ్లడ్ ఎక్కించాలని చారి కుటుంబ సభ్యులకు చెప్పారు. వారికి ఏం చేయాలో పాలుపోక హుజూర్ నగర్ లో ఉన్న డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు కి ఫోన్ చేసి చెప్పారు.
విషయం తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి దగ్గుపాటి సురేష్, చలి కంటి అజయ్ ని హైదరాబాద్ పంపించారు. అక్కడ వారు రక్తదానం చేశారు. దానితో రోగికి ప్రాణాపాయం తప్పింది.
ఈ సందర్భంగా DSR ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ హుజుర్ నగర్ పట్టణానికి చెందిన బ్లడ్ డోనర్ చలికంటి అజయ్ కి ట్రస్ట్ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రక్తదానం మరొకరికి ప్రాణదానమని, రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు.