33.7 C
Hyderabad
April 29, 2024 23: 27 PM
Slider హైదరాబాద్

రక్త దానం చేసి ఒకరిని ఆదుకున్న డి ఎస్ ఆర్ ట్రస్ట్

#BloodDonation

హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తిని హుజూర్ నగర్ డి ఎస్ ఆర్ ట్రస్టు రక్తదానంతో ఆదుకుంది. నల్లగొండకి చెందిన అనుముల శ్రీనివాస చారి (35) అనారోగ్యంతో హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి సిటిజన్ హాస్పిటల్ లో చేరాడు. అతనికి తదుపరి చికిత్స చేసేందుకు రక్తం అవసరమైంది.

డాక్టర్లు బ్లడ్ ఎక్కించాలని చారి కుటుంబ సభ్యులకు చెప్పారు. వారికి ఏం చేయాలో పాలుపోక హుజూర్ నగర్ లో ఉన్న డి ఎస్ ఆర్ ట్రస్ట్  చైర్మన్  దగ్గుపాటి బాబురావు కి ఫోన్ చేసి చెప్పారు.

విషయం తెలుసుకున్న ఆయన  వెంటనే స్పందించి దగ్గుపాటి సురేష్, చలి కంటి అజయ్ ని హైదరాబాద్ పంపించారు. అక్కడ వారు రక్తదానం చేశారు. దానితో రోగికి ప్రాణాపాయం తప్పింది.

ఈ సందర్భంగా DSR ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ హుజుర్ నగర్ పట్టణానికి చెందిన బ్లడ్  డోనర్ చలికంటి అజయ్ కి ట్రస్ట్ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

రక్తదానం మరొకరికి ప్రాణదానమని, రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు.

Related posts

విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి

Satyam NEWS

కడప జిల్లాలో నేటి నుంచి ఆపరేషన్ ముస్కాన్

Satyam NEWS

మున్సిపల్ కార్యాలయం నూతన భవనాన్ని పరిశీలించిన మంత్రి

Satyam NEWS

Leave a Comment