నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో బీరం హర్షవర్ధన్ రెడ్డికి ఓట్లు వేసి వేయించి గెలిపించామని, అయితే ఇప్పుడు ఇందుకోసమా గెలిపించింది అని ప్రశ్నించుకొని ప్రజలు మంగళవారం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చెంతకు చేరారు. కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండలం నర్సాయిపల్లి గ్రామ యువకులు, కొల్లాపూర్ మున్సిపాలిటీ ఆరోవ వార్డు కౌన్సిలర్ మేకల రమ్య నాగరాజు ఆధ్వర్యంలో అ వార్డుకు సంబంధించిన యువత, మహిళలు జూపల్లి చెంతకు చేరారు.
ఈ సందర్భంగా వారు జూపల్లికి శాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపారు. గత ఎన్నికల్లో హర్షవర్ధన్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేయడానికి కృషి చేశామని చెప్పారు. ఈరోజు ఎందుకు చేశామా అనే పరిస్థితికి ఎమ్మెల్యే తీసుకొచ్చారని వారు అన్నారు. ఇప్పటికి ఎలాంటి మార్పు రాలేదని వారు వాపోయారు. నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అవసరం ఉందని వారు అన్నారు. అందుకే జూపల్లి చెంతకు చేరుతున్నట్లు వారు తెలిపారు. అంతకుముందు మాజీ మంత్రి కి శాలువా కప్పి పూల బోకే ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు.