కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో కర్నాటక లో లాక్ డౌన్ ప్రకటించారు. మే 4వ తేదీ వరకూ లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తుండగా ఉదయం వేళల్లో కూడా జన సంచారాన్ని అదుపు చేస్తే తప్ప కరోనా కంట్రోల్ కాదని ప్రభుత్వం భావించింది.
ఉదయం వేళల్లో కేవలం అత్యవసరాలను మాత్రమే అనుమతిస్తారు.
ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ మాత్రమే కూరగాయల దుకాణాలు, పాల దుకాణాలు తెరచి ఉంటాయి.
సినిమా హాళ్లు, మాల్స్, ఫంక్షన్ హాళ్లు, విద్యా సంస్థలను మూసివేయాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది.