36.2 C
Hyderabad
April 27, 2024 22: 48 PM
Slider ఆధ్యాత్మికం

పుష్పపల్లకీపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామి ద‌ర్శ‌నం

#lord balaji

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఆణివార ఆస్థానం సందర్భంగా శుక్ర‌వారం సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు. చిరుజల్లుల  నడుమ పుష్పపల్లకీ సేవ సాగింది.

ఆరు ర‌కాల సంప్ర‌దాయ పుష్పాలు, ఆరు ర‌కాల క‌ట్ ఫ్ల‌వ‌ర్లు క‌లిపి దాదాపు ఒక ట‌న్ను పుష్పాల‌తో హంస ఆకారంలో ప‌ల్ల‌కీని అలంక‌రించారు. ప‌ల్ల‌కీ ముందు వైపు శ్రీ‌రాముడు, శ్రీకృష్ణుడు, మ‌ధ్య భాగంలో చిన్నికృష్ణుడు, వెనుక‌వైపు బాల ఆంజ‌నేయ‌స్వామివారి ఆకృతుల‌ను రూపొందించారు. 15 మంది అలంకార నిపుణులు 3 రోజుల పాటు శ్ర‌మించి ఈ పుష్ప‌ప‌ల్ల‌కీని త‌యారుచేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో ఎ.వి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో ర‌మేష్‌బాబు, ఉద్యానవ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాసులు, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్, పేష్కార్ శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Related posts

‘ఇన్స్పెక్టర్ ప్రసాద్’ పాత్రకు ‘V పరీతమైన ప్రశంసలు

Satyam NEWS

మైనారిటీ ఓట్ల కోసం సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలు

Satyam NEWS

కొణిజర్ల లో గోద్రెజ్ కంపెనీ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ

Satyam NEWS

Leave a Comment