28.7 C
Hyderabad
April 26, 2024 10: 43 AM
Slider ఆదిలాబాద్

ఓగాడ్: నిర్మ‌ల్ జిల్లాలో వలసకూలీలకు రోడ్డు ప్రమాదం

#Minister Indrakaranreddy

హైద‌రాబాద్ నుంచి గోరఖ్ పూర్ వెళ్ళుతున్న వలస కార్మికులు ప్రమాదానికి లోనయ్యారు. వారు ప్రయాణిస్తున్న లారీ నిర్మ‌ల్ ‌ జిల్లా భాగ్య‌న‌గ‌ర్ లో జాతీయ ర‌హ‌దారిపై  రెయిలింగ్ ను ఢీకొట్టి అదుపుత‌ప్పింది. మొత్తం 70 మంది వ‌ల‌స కార్మికులు ఆ లారీలో ప్ర‌యాణిస్తున్నారు. వారిలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

మరో 20 మందికి స్ప‌ల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏడుగురికి నిర్మ‌ల్ ఏరియా ఆసుప‌త్రిలో చికిత్స‌ చేస్తున్నారు. ఇద్ద‌రు క్ష‌త‌గాత్రుల‌ను హైద‌రాబాద్ కు  త‌ర‌లించారు. రాష్ట్ర మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.

Related posts

సుస్థిర అభివృద్ధి సాధనకు మనసు పెట్టి పని చేయాలి…!

Satyam NEWS

కోర్టుకు చేరిన కర్నాటక మహిళా బ్యూరోక్రాట్ల కేసు

Satyam NEWS

తోటమాలి

Satyam NEWS

Leave a Comment