సోమశిల క్షేత్రంలో శ్రీశ్రీశ్రీ లలిత సోమేశ్వర స్వామీ ఆలయంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ రుద్ర సహిత మహా చండి యాగం కార్యక్రమంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని కృష్ణనది ఒడ్డున ఉన్న సోమశిల క్షేత్రంలో లలిత త్రిపుర సుందరి, ద్వాదశ జ్యోతిర్లింగాలు, సోమేశ్వరుడు కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ సన్నిధిలో 108 జంటలతో జరుగుతున్న మహా చండి యాగం కార్యక్రమంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తో బాటు సోమశిల గ్రామ సర్పంచ్ మద్దిలేటి పాల్గొన్నారు.
అనంతరం గ్రామ సర్పంచ్ మద్దిలేటి అధ్వర్యంలో సోమశిల గ్రామస్థులు మాజీ మంత్రి జూపల్లి ని శాలువాతో సన్మానించారు. అంతకు ముందు మాజీ మంత్రి జూపల్లి తన అనుచరులతో కలిసి శ్రీశ్రీశ్రీ లలిత సోమేశ్వర స్వామీ వారి సన్నిధిలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో నిర్వహించి శ్రీశ్రీశ్రీ లలిత సోమేశ్వర స్వామీ వారి నీ దర్శించుకున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు సుఖ,సంతోషాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. ఈ చండి యాగం కార్యక్రమంలో జూపల్లి తో పాటుగా కొల్లాపూర్ మండల,సోమశిల గ్రామ ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు జూపల్లి అనుచరులు పాల్గొన్నారు.