టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గంలోని చిల్కానగర్ డివిజన్ వార్డు కార్యాలయం లో కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మహిళా బంధు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు సుభద్ర, మహిళా సీనియర్ నాయకులు, పారిశుద్ధ్య కార్మికుల తో కలసి మహిళా బంధు కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి, పాలాభిషేకం చేశారు.
అనంతరం పారిశుద్ధ్య మహిళా కార్మికులను ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని రీతిలో కెసిఆర్ కిట్ ద్వారా 10 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చారని, ప్రత్యేకంగా మహిళల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మిషన్ భగీరథ వంటి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన మహిళా బంధు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో శానిటేషన్ డీ ఈ. చందన సూపర్వైజర్ సుదర్శన్, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, టిఆర్ఎస్ మహిళా నాయకులు సుభద్ర, ఉషరాని, అనసూయ, ఆండాలు, షహనాజ్, సత్యవతి, కనకతార, భాగ్యలక్ష్మి, అంజలి, వసంత, సీనియర్ నాయకులు ఎదుల కొండల్ రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి కోకొండ జగన్, మాస శేఖర్, ఎండీ. మహమూద్, రాంచందర్, సందేపల్లి శ్రీనివాస్, అశోక్ చారి, బింగి శ్రీనివాస్, నారాయణ రెడ్డి, శ్రీను నాయక్, రామానుజం,జంపని బాలు గౌడ్, యాదగిరి, పోచన్న, బాలు, ఫరూక్, జిల్లాల ప్రవీణ్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి