తబ్లిగీ జమాత్ ప్రభావమో, కరోనా వైరస్ గురించిన అవగాహన వచ్చిందో తెలియదు కానీ నేడు హైదరాబాద్ లోని చాలా మసీదుల్లో సామూహిక ప్రార్ధనలు జరగలేదు. ప్రతి శుక్రవారం కిటకిటలాడే మసీదులు గత వారం వరకూ కూడా సమూహిక ప్రార్ధనలకు నిలయాలయ్యాయి.
మెహిదీపట్నం, నానాలనగర్, మల్లేపల్లి ప్రాంతాలలోని ఏ మసీదులో కూడా సామూహిక ప్రార్ధనలు జరగలేదు. మక్కా మసీదు తెరవలేదు. చార్మినార్ ప్రాంతం మొత్తం నేడు నిర్మానుష్యంగా కనిపించింది.