29.7 C
Hyderabad
April 29, 2024 09: 12 AM
Slider మహబూబ్ నగర్

జానారెడ్డిని విమర్శించే స్థాయి కేసీఆర్ కు లేదు

#malluravi

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిఎం పదవిని త్యాగం చేసిన నాయకుడు కుందూరు జానారెడ్డి అని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.

అలాంటి వ్యక్తిని పట్టుకుని సిఎం కేసీఆర్ విమర్శించడం తగదని ఆయన అన్నారు. జానారెడ్డి పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు.

నాగార్జున సాగర్ ఎన్నికల తరువాత కేసీఆర్ రెస్ట్ తీసుకోవాల్సిందేనని ఆయన ఎద్దేవా చేశారు.

నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న జానారెడ్డి ది ముక్కు సూటి తత్వనమి మల్లు రవి అన్నారు.

అలాంటి సీనియర్ నాయకుడిపై మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు.

తెలంగాణ పట్ల కేసీఆర్ కు చిత్త శుద్ది ఉంటే .. జానారెడ్డి నీ ఏకగ్రీవానికి ప్రయత్నం చేయాల్సిందని ఆయన అన్నారు.

రాజకీయ నాయకులను కేసీఆర్ పశువుల సంతలో కొన్నట్లు కొంటున్నాడు. టీఆర్ఎస్ పతనం మెదలైయ్యింది అని మల్లు రవి విమర్శించారు.

Related posts

లాయల్: స్వార్ధం కోసం పార్టీ మారేవాడిని కాదు

Satyam NEWS

వేల ఎకరాలు ప్రజల కోసం ధారాదత్తం చేసిన నేత అశోక్ గజపతిరాజు

Satyam NEWS

పొలిటికల్ ఎన్ కౌంటర్ : మీలాగా బజారు భాష మాట్లాడలేను

Satyam NEWS

Leave a Comment