గుంటూరు జిల్లా మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ తరువాత కీలకమైన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం జీఓ జారీ చేసింది.
తొమ్మిది మంది సభ్యులు రెండేళ్ల కాల పరిమితితో కొనసాగేలా జీఓ లో పేర్కొన్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు వీరే: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులుగా జగన్నాధం శ్రీనివాస్, వనమా గీతా దేవి, గోలి కస్తూరి, గోడవర్తి శ్రీనివాసరావు, కంచర్ల వెంకయ్య, ఆకురాతి కోదండ రామయ్య, అన్నే శ్రీదేవి, ఆళ్ల రంగారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాభాచార్యులను సభ్యులు గా నియమించారు.
తమ నియామకానికి సహకరించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కు నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.