29.7 C
Hyderabad
April 29, 2024 10: 29 AM
Slider విశాఖపట్నం

పాడేరు ఏజెన్సీలో మావోయిస్టుల లేఖ ప్రత్యక్షం

#MaoistLetter

వైద్య ఆరోగ్య రంగానికి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని సిపిఐ మావోయిస్టు AOBSZC కార్యదర్శి గణేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.

విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన పాడేరులో ఈ లేఖ ప్రత్యక్షమైంది. మానవ జాతి మనుగడకే ప్రశ్నార్ధకంగా మారిన కరోన  వైరస్ నివారణకు వ్యాక్సిన్లు, టీకాలు పరిష్కారం కావని ఆయన పేర్కొన్నారు.

సోషలిస్టు సమాజ నిర్మాణమే ఏకైక పరిష్కారమని ఆయన అన్నారు. ప్రజా యుద్ధం ద్వారా సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ విధానాన్ని ధ్వంసం చేద్దాం.

సోషలిస్టు  సమాజాన్ని నిర్మిద్దాం. మానవ జాతి మనుగడను కాపాడుకుందాం అని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు తీసుకున్న అన్ని రుణాలను ప్రభుత్వం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రజలందరికి ఉపాధి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

మరదలిపై యాసిడ్ దాడి చేసిన బావ

Satyam NEWS

హార్స్లీ హిల్స్ భూములు అప్పనంగా రాయిస్తే ప్రజలు బుద్ధి చెబుతారు

Satyam NEWS

రుధిర ధారల మధ్య కూడా తరగని తల్లి ప్రేమ

Satyam NEWS

Leave a Comment